వరంగల్ అర్బన్ : మేమంతా టీఆర్ఎస్లో ఉంటామని పార్టీ అభివృద్ధి కృషిచేస్తూ మా గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు,కార్యకర్తలు తెలిపారు. సోమవారం హన్మకొండలో కమలాపూర్ మండలం ఇంచార్జి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేసున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని వదిలే సమస్యలేదని, తామంతా టీఆర్ఎస్లోనే ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసేవారికి పార్టీ అండగా నిలుస్తుందని, పార్టీ అధినేత సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు సూచనలతో అందరూ ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. గ్రామ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారిని కలిసిన వారిలో శ్రీరాములపల్లి, అంబాల, గూనిపర్తి, శనిగరం, దేశరాజుపల్లి, మాదన్నపేట, లక్మిపూర్, కానిపర్తి, నెరేళ్ల, శంభునిపల్లి, భీంపల్లి, పంగిడిపల్లి, గుండేడు, కొత్తపల్లి, గోపాల్ పూర్, ఉప్పల్, ఉప్పల్ పల్లి గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, రైతుబంధు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ పేరియాల రవీందర్ రావు, రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు, పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా రామకృష్ణ, నాయకులు పింగిలి ప్రదీప్ రెడ్డి, ఎర్రం ఇంద్రసేన రెడ్డి, టి.శ్రీకాంత్, ఎం.నవీన్ కుమార్, జెడ్పిటిసిలు సిలువేరు మొగిలి, కోడెపాక కరుణాకర్, ఎంపిపిలు మచ్చ రవీందర్, స్వర్ణలత, పాడి ప్రతాప్ రెడ్డి, తిప్పర్తి సాంబశివరెడ్డి, ఆముదాలపల్లి అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కమలాపూర్ మండలం దేశరాజుపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన 8వ వార్డు సభ్యులు ఈసంపల్లి రమేష్, భీంపల్లి గ్రామం బీజేపీ పార్టీకి చెందిన వార్డు సభ్యులు అకినపల్లి రామ్మూర్తి ఆయా పార్టీలకు రాజీనామా చేసి కమలాపూర్ మండల ఇంచార్జి,పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.