వరంగల్ : కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా కూడా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నటువంటి ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. ఇవాళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండాలని , దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెక్కులను అందజేస్తుందన్నారు. ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 31వ డివిజన్కు సంబందించిన 8 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వాసుచంద్రన్, ఎమ్మార్వో కిరణ్ కుమార్, కూడా డైరక్టర్ శివ శంకర్, గిర్దావర్ సురేందర్ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.