ములుగు : దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన కల్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డలకు అండగా నిలుస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. ములుగు ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సీతక్క తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో ఆడబిడ్డల వివాహ ఖర్చులకు తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ములుగు మండలంలోని భాగ్య తండాలో కళ్లారా చూసిన కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఈ పథకం అన్ని వర్గాల ఆడబిడ్డలకు వరంగా మారిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ రామ్ నాయక్, ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య పాల్గొన్నారు