చివ్వెంల, జూలై 22 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని గుంజలూరు, జీ తిరుమలగిరి, గుంపుల, తుల్జారావుపేట, వల్లభాపురం, ఉండ్రుగొండ, దురాజ్పల్లి గ్రామాల్లో 30 మంది లబ్ధిదారులకు ఇంటికెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీచేశారు. కార్యక్రమంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.