హైదరాబాద్ : రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి తనయుడు హిమాన్షు.. తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన బాబాయి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్తో కలిసి హిమాన్షు.. ప్రగతి భవన్లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా హిమాన్షు మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు అందరు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని సూచించారు.
అనంతరం ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. హిమాన్షుకు ఈ జన్మదినం ప్రత్యేకమైనది అని తెలిపారు. హిమాన్షు దత్తత తీసుకున్న రెండు గ్రామాల్లో కల్తీ లేని ఆహారం కోసం గొప్ప కార్యక్రమం చేపట్టి.. విజయవంతంగా అమలు చేసినందుకు.. డయానా అవార్డు వరించిందని పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో హిమాన్షు పాల్గొని మొక్కలు నాటడం సంతోషకరమైనది. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీస్సులు అందిస్తున్నాని సంతోష్ కుమార్ తెలిపారు.