నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ కౌంటింగ్ రసవత్తరంగా సాగుతోంది. రౌండ్ రౌండ్కూ ఆధిక్యం చేతులు మారుతోంది. 13వ రౌండ్ ముగిసే సమయానికి సీఎం మమతా బెనర్జీ మళ్లీ వెనుకంజలోకి వెళ్లిపోయారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 3800 ఓట్ల ఆధిక్యం ఉన్నారు. తొలి ఐదు రౌండ్లలో ఆధిక్యం ప్రదర్శించిన సువేందు.. ఆ తర్వాత ఆధిక్యం కోల్పోయారు. అయితే 13వ రౌండ్ తర్వాత మరోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతో నందిగ్రామ్పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.