హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఇక్కడ నివసించే ఇతర అన్ని రాష్ర్టాల ప్రజలను సొంతవారిగా ఆదరిస్తున్నారని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కరోనా విపత్తు నుంచి ఇతర రాష్ర్టాల ప్రజలను సంరక్షించుకుంటామని చెప్పారు. మలయాళీలంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానమని తెలిపారు. కాన్ఫడరేషన్ ఆఫ్ తెలుగు రీజియన్ మలయాళీ అసోసియేషన్ (సీటీఆర్ఎంఏ) ఇన్ అసోసియేషన్ విత్ మలయాళం మిషన్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో కొవిడ్-19 మూడో వేవ్ను సమర్థంగా ఎదుర్కోవడంపై ఆదివారం జూమ్ యాప్లో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో మలయాళీలు అందిస్తున్న సేవలను మంత్రి శ్రీనివాస్గౌడ్ కీర్తించారు. భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైనప్పుడు సీఎం కేసీఆర్ ఆపన్నహస్తం అందించారని గుర్తుచేశారు.
సర్దార్ సర్వాయి పాపన్నపై పుస్తకావిష్కరణ
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన దాదాపు వందమంది కవుల కవితలతో సర్దార్ సర్వాయి పాపన్నపై తెలుగు భాషా చైతన్య స్రవంతి, లక్షసాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘బహుజన తొలి చక్రవర్తి సర్వాయి పాపన్న’ అనే కవితా సంకలనాన్ని రూపొందించారు. దీన్ని ఆదివారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో క్రీడా, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో బడేసాబ్, ఓంకార్, మల్లయ్య, శ్రీనయ్య, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.