ముంబై, జూన్ 17: కరోనా ఫస్ట్, సెకండ్వేవ్లలో దేశంలో ఎక్కువగా ప్రభావితమైన మహారాష్ట్రకు థర్డ్వేవ్ ముప్పు త్వరలోనే పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో 2-4 వారాల్లో కరోనా థర్డ్ వేవ్ రాష్ట్రంలో ప్రారంభం కావొచ్చని మహారాష్ట్ర కొవిడ్ టాస్క్ ఫోర్స్ రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరించింది. సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ తీవ్రత రెట్టింపు ఉంటుందని, రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 8 లక్షలకు పెరిగే ప్రమాదముందని అంచనా వేసింది. గురువారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొవిడ్పై సమీక్ష సందర్భంగా అధికారులు ఈ సూచనలు చేశారు. థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. మొత్తం కేసుల్లో పిల్లలకు సంబంధించినవి 10 శాతం ఉండొచ్చని తెలిపారు.
జూలైలో పిల్లలపై నొవావాక్స్ ట్రయల్స్
చిన్నపిల్లలపై నొవావాక్స్ క్లినికల్ ట్రయల్స్ను జూలై నుంచి నిర్వహించాలని సీరం ఇన్స్టిట్యూట్ యోచిస్తున్నది.భారత్లో పిల్లలపై ట్రయల్స్ నిర్వహించబోయే నాలుగో టీకా ఇది.