నందమూరి బాలకృష్ణ- బోయపాటి శీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అఖండ చిత్రంపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఇటీవల ఈ చిత్ర టైటిల్ టీజర్ విడుదల కాగా, ఇది రికార్డులని బ్రేక్ చేస్తుంది. టీజర్ విడుదలై రెండు వారాలు కూడా కాకముందే 50 మిలియన్స్ వ్యూస్ సాధించి టాప్ 3లో నిలిచింది.
ఇప్పటికే ‘సరిలేరు నీకెవ్వరు, భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ల రికార్డులను బ్రేక్ చేసింది అఖండ. ఇప్పటి వరకు 54.5 మిలియన్ల వ్యూస్ నమోదుచేసి అల్లు అర్జున్ ‘పుష్ప’ మొదటి స్థానంలో ఉండగా 50.6 మిలియన్లతో ‘రామరాజు ఫర్ భీమ్’ రెండవ స్థానంలో ఉంది. బాలయ్య గర్జన చూస్తుంటే వాటిని కూడా అఖండ బ్రేక్ చేస్తుందేమోనని అనిపిస్తుంది. టీజర్ హవాతో సినిమాకు ట్రేడ్ వర్గాలలో మంచి డిమాండ్ ఏర్పడింది. బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయాలని అనుకున్నారు. కరోనా వలన ఈ మూవీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.