సిద్దిపేట, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ఎత్తిపోల పథకంలోనే అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్లోకి నీటి తరలింపు ట్రయల్న్ విజయవంతమైంది. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ పంప్హౌస్లో ఆదివారం తెల్లవారుజామున నీటిపారుదలశాఖ ఈఎన్సీ హరిరాం ప్రత్యేక పూజలు నిర్వహించి మోటర్లను ఆన్చేశారు. పంప్హౌస్లో మొత్తం 8 మోటర్లుఉండగా.. మూడింటిని ఆన్చేసి మల్లన్నసాగర్లోకి నీటిని ఎత్తిపోశారు. ఒక్కొక్కటిగా అన్ని మోటర్లను పరిశీలించనున్నారు. 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న జలాశయంలోకి ప్రస్తుతం 10 టీఎంసీలు తరలించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మల్లన్నసాగర్లోకి కాళేశ్వర జలాలు చేరడంతో సీఎం కేసీఆర్ స్వప్నం సాకారమైందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ‘సీఎం కేసీఆర్ స్వప్నం సాక్షాత్కారం. తెలంగాణకు అమృతజలాభిషేకం.. సాకారమైన మల్లన్నసాగరం. అనుమానాలు, అపశకునాలు, అవరోధాలు తలవంచి తప్పుకున్నాయి. కుట్రలు, కుహనా కేసులు వందల విమర్శలు వరద నీటిలో కొట్టుకపోయాయి. గోదావరి గంగమ్మ మల్లన్నసాగరాన్ని ముద్దాడింది. కరువును శాశ్వతంగా సాగనంపింది. తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసింది. ప్రజల విశ్వాసంతో పట్టుదలతో పనిచేస్తే కానిదేది లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచానికి చాటింది’ అంటూ హరీశ్రావు ట్వీట్చేశారు.