ఆదిలాబాద్ ట్రాఫిక్ సీఐ గంగాధర్
నిబంధనలపై అవగాహన
ఎదులాపురం, ఏప్రిల్ 12: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని లేనిచో జరిమానా తప్పదని ట్రాఫిక్ సీఐ గంగాధర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తా వద్ద సోమవారం ఆటో డ్రైవర్లకు కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆటోలో మాస్కు ధరించిన ప్రయాణికులను ఎక్కించుకోవాలన్నారు. మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ అబ్దుల్ బాకీ, కానిస్టేబుళ్లు, తదితరులు పాల్గొన్నారు.
కరోనా కట్టడికి సహకరించాలి
నార్నూర్, ఏప్రిల్ 12: కరోనా కట్టడికి గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని గాదిగూడ ఎంపీపీ ఆడ చంద్రకళరాజు కోరారు. గాదిగూడ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, సర్పంచ్లు, ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. లక్షణాలు ఉన్నవారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని, 45ఏండ్లు పైబడిన వారు టీకా వేయించుకోవాలని సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ మెస్రం గంగుబాయి, వైస్ఎంపీపీ యోగేశ్, తహసీల్దార్ ఆర్కా మోతీరాం, ఎంపీడీవో రామేశ్వర్, ఎంపీవో సాయిప్రసాద్, ఈజీఎస్ ఏపీవో అమర్సింగ్ పాల్గొన్నారు.
జాగ్రత్తలు పాటించాలి
జైనథ్, ఏప్రిల్ 12: కరోనా వ్యాప్తి తగ్గించడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సీఐ మల్లేశ్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గోవర్ధన్తో కలిసి అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాస్కు ధరించని వారికి పోలీసులు రూ.1000 జరిమానా విధిస్తారన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. పబ్లిక్ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎస్ లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ వెంకట్రెడ్డి, ఎంపీడీవో గజానన్, తహసీల్దార్ మహేంద్రనాథ్ పాల్గొన్నారు.
మాస్కు ధరించాలి
నార్నూర్, ఏప్రిల్ 12: ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఎస్ఐ విజయ్కుమార్ అన్నారు. మండలంలోని నాగల్కొండ గ్రామంలో పోలీస్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ సునీత, ఉపసర్పంచ్ షేక్ అజార్, ట్రైనీ ఎస్ఐలు రాధిక, ధన్శ్రీ, పంచాయతీ కార్యదర్శి వినోద్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 12: మండలంలోని మత్తడిగూడ గ్రామంలో ఈవో సత్యనారాయణ గ్రామస్తులకు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిడాం లచ్చు, జుగదిరావు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
ఇచ్చోడ, ఏప్రిల్ 12: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ అతిఖొద్దీన్ సూచించారు. మండల కేంద్రంలో సోమవారం రెవెన్యూ, పోలీస్, ఐసీడీఎస్, పంచాయతీ రాజ్, ఐకేపీ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీటీ రామారావ్, ఎస్ఐ ఫరీద్, ఏపీఎం దయాకర్, ఏవో కైలాస్ జాదవ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు ల్గొన్నారు.
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 12: మండల కేంద్రంలో ఎస్ఐ నాగ్నాథ్ ప్రజలకు కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కరోనా రెండో వేవ్: మున్ముందు ఉద్యోగాల కల్పన సవాలే!
RR vs PBKS : దంచికొడుతున్న క్రిస్గేల్