మోటకొండూర్, మార్చి 23: కరోనా వ్యాక్సిన్పై అపోహలు, అనుమానాలను వీడి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ను వేయించుకో వాలని మండల వైద్యాధికారి రాజేందర్నాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని మహాత్మా జ్యోతి బాఫులే గురు కుల పాఠశాలలో, స్థానిక పీహెచ్సీలో మొత్తం 45 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్ర మత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక పీహెచ్సీలో 12 మందికి, గురుకుల పాఠశాలలో 33 మందికి మొత్తం 45 మం దికి టీకా వేశామని తెలిపారు. పీహెచ్సీలో అందుబాటులో ఉ న్న వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమం లో ఆలేరు సీడీపీవో చంద్రకళ, డీడబ్ల్యూవో కృష్ణవేణి, వైద్యుడు ప్రవీణ్కుమార్, ఏఎన్ఎం ధనమ్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ, ల్యాబ్ టెక్నీషియన్ సునీత, అంగన్వాడీ టీచర్లు అనురా ధ, లావణ్య, రాధిక, సిద్ధమ్మ, వసంత, భాగ్యలక్ష్మి, పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, వార్డెన్ కవిత, హెల్త్ సూపర్వైజర్ సృజన, ఉపాధ్యాయులు నవనీత, శైలజ, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
60 ఏండ్లు దాటిన వారు టీకాలు తీసుకోవాలి
తుర్కపల్లి: 60 సంవత్సరాలు దాటిన వారు కరోనా టీకా తీసు కోవాలని మండల వైద్యాధికారి చంద్రారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 24 మందికి టీకాలు వేశారు. అదే విధంగా 30మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్గా నిర్దారణ అయింది.
విద్యార్థులకు కరోనా పరీక్షలు
ఆలేరురూరల్: శారాజీపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో మంగళవా రం మండలంలోని కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 152 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది. కాగా ఇద్దరిని హోం క్వారంటైన్లో ఉండాలని ఆశ నోడల్ అధికారి పెద్దలక్ష్మి తెలి పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంచంద్రయ్య, ఏఎన్ఎంలు రత్నాబాయి, సునీత, ఆశ కార్య కర్తలు లలిత, పావని, మాధవి, విద్యార్థులు పాల్గొన్నారు.