హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా ప్రమాణం స్వీకరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రాతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి చెందిన ప్రశాంత్కుమార్ మిశ్రా బిలాస్పూర్లోని గురుఘాసిదాస్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా, రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్గా సేవలందించారు.