యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం దర్శించుకున్నారు. శనివారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న జస్టిస్ కోదండరాం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. తర్వాత ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించారు.