హైదరాబాద్ : పౌర, పన్నులు, నేరాల కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చిన జస్టిస్ జాస్తి ఈశ్వర్ ప్రసాద్(87) గుండెపోటుతో కన్నుమూశారు. 1934 ఆగస్టు 4న ఆయన జన్మించారు. ఏపీ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1990-94 మధ్య ఉమ్మడి ఏపీ హైకోర్టు జడ్జిగా సేవలందించారు. 1996లో కర్ణాటక హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అనంతరం 1997లో భూకబ్జా నిరోధక చట్టం కోర్టు చైర్మన్గా, నేషనల్ ట్రైబ్యునల్గా పనిచేశారు.లౌకికవాదం, రాష్ర్టాల పాత్రపై జస్టిస్ జాస్తి ఈశ్వర్ ప్రసాద్ కీలక తీర్పులు వెలువరించారు.