హైదరాబాద్ : రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న 3,588 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలు విడుదల అయ్యాయి. జూన్, జులై నెలలకు చెందిన గౌరవ వేతనం రూ. 38 కోట్ల 82 లక్షల 15 వేలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి హరీశ్రావుకు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఇంటర్ కమిషనర్ ఒమర్ జలీల్కు ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా 2021- 22 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెన్యువల్ ఉత్తర్వులు కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు.