ముల్కలపల్లి: క్యాస్ట్ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసిన ఒక ఆటో డ్రైవర్ నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ దొరికిపోయాడు. ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముల్కలపల్లి తహసీల్దారు కార్యాలయంలో ఉప్పుతోల్ల రవీంద్ర కుమార్ పనిచేస్తున్నాడు. జూనియర్ అసిస్టెంట్ అయిన అతను సాదమ్ శ్రీనివాస్ అనే ఆటో డ్రైవర్ వద్ద లంచం తీసుకున్నాడు.
తనకు, తన కుమార్తెకు క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం శ్రీనివాస్ దరఖాస్తు చేశాడు. ఈ దరఖాస్తు, అలాగే సర్టిఫికెట్ జారీ చేయడానికి అతని వద్ద నుంచి రవీంద్ర లంచంగా రూ.6 వేలు వసూలు చేశాడు. ఈ సొమ్ము తీసుకుంటుండగా అతన్ని రెడ్హ్యాండెండ్గా అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.