హైదరాబాద్ : జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ను క్రియేట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే స్నేహితులు, మద్దతుదారులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. ఎమ్మెల్యే మాగంటి ఖాతానే అయి ఉండొచ్చు అని అందరూ అంగీకరించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఫండ్స్ కావాలని ఆ ఫేక్ ఖాతా నుంచి సందేశం పంపారు. అనుమానం వచ్చిన కొంత మంది ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే టీమ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.