రామచంద్రాపురం, ఏప్రిల్ 27: కరోనాతో దవాఖానలో చికిత్స పొందుతు న్న ఓ జర్నలిస్టుకు సాయం చేయాలని ఓ జంట డబ్బులు వసూలు చేసి పరారైంది. సదరు జర్నలిస్టుకు సకాలం లో సరైన చికిత్స అందక మృతి చెందా డు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని ఓ దవాఖానలో చోటుచేసుకున్నది. ఓ టీవీ చానల్లో క్రైం రిపోర్టర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఎల్బీనగర్ లో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారు. ఓ ప్రైవేట్ దవాఖానలో చేరిన ఆయన మెరుగైన చికిత్స కోసం బీరంగూడ కమాన్ వద్ద ఉన్న ఎన్కేర్ దవాఖానలో ఈనెల 21న చేరారు. లంగ్స్ 90 శాతం ఇన్ఫెక్షన్కి గురికావడంతో వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందించారు.
చంద్రశేఖర్ చికిత్స కోసం సహాయం చేయాలని కొందరు గూగుల్పే, ఫోన్పే నంబర్లను సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టుచేయడంతో చాలామంది జర్నలిస్టులు డబ్బులు పంపా రు. చికిత్స సమయంలో అతని భార్య రాణి రూ.2.5 లక్షల వరకు చెల్లించింది. కాగా చికిత్స పొందుతూ చంద్రశేఖర్ మంగళవారం మృతి చెందారు. ఇంకా రూ.3 లక్షల వరకు బిల్లు కట్టాల్సి ఉన్నది. అయితే ఎల్బీనగర్లో చంద్రశేఖర్ ఇంటి పక్కనే ఉండే దంపతులు బీ కురుమూర్తి, రాజేశ్వరి.. జర్నలిస్టుకు మెరుగైన వైద్యం కోసం గూగుల్పే, ఫోన్పే నంబర్ (9032141801), ఎస్బీఐ ఖాతా నంబర్ (52023254147) వారివే ఇచ్చి.. వచ్చిన డబ్బులతో ఉడాయించినట్టు ఆలస్యంగా తెలిసింది. ఈ మేరకు డాక్టర్ వంశీ సదరు దంపతులపై ఆర్సీపురం ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు.