హుజురాబాద్ : ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు నర తిరుపతిరెడ్డి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయన తిరుపతి రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నరతిరుపతి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని అన్నారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు.