కొల్లాపూర్ : కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో 33/11 సబ్ స్టేషన్ను రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు. కృష్ణా నదిపై జోగులాంబ బ్యారేజీ నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి.. అధికారులు త్వరలోనే సర్వే చేపడుతారని తెలిపారు. కృష్ణా జలాల కేటాయింపులను పూర్తి స్థాయిలో వాడుకోలేకపోతున్నామని చెప్పారు. నికర జలాల సామర్థ్యానికి లోబడే జోగులాంబ బ్యారేజీని నిర్మించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించడం జరిగిందని గుర్తు చేశారు. జూరాల, బీమా నుంచి కేవలం ఆరున్నర టీఎంసీల నీళ్లు మాత్రమే వినియోగంలోకి వస్తున్నాయని స్పష్టం చేశారు. జోగులాంబ బ్యారేజీ నిర్మాణంతో ఈ ప్రాంతంలో రవాణా మెరుగవుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.