పెద్దపల్లి : ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండంలో స్థానిక నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత ఎంఓఎస్ భగవంత్ కూభా(Minister for fertilizers, chemicals and Renewable energy)ను కోరారు. అదేవిధంగా హమాలీలకు న్యాయం చేకూర్చాలన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ట్రాన్స్పోర్టర్స్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించడం వల్ల ఎవరైతే భూములను కోల్పోయిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. అదేవిధంగా రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అధికారులపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి మాల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి ఎంక్వయిరీ వేయాలని ఎంపీ కోరారు.
ఇవి కూడా చదవండి..
హరితహారం మొక్కలు ధ్వంసం.. రూ. 5వేల జరిమానా
కీలక అంశాలపై చర్చకు మోదీ సర్కార్ వెనుకంజ!
Tokyo Olympics: చరిత్రలో ఇంతకు మించిన విజయం ఉండదేమో..!
మెడికల్ హబ్గా మారనున్న మహబూబ్నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్