హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో దారుణం జరిగింది. కూకట్పల్లిలోని సఫ్దార్ నగర్లో తాగొచ్చి గొడవ చేస్తున్నాడని తండ్రిని చంపాడో కొడుకు. ఇంతియాజ్ అనే వ్యక్తి తన కుటుంబంతో సఫ్దార్ నగర్లో ఉంటున్నాడు. అతడు రోజు మద్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. దీంతో విసిగెత్తిన ఇంతియాజ్ కొడుకు.. తన తండ్రిని కట్టెతో కొట్టాడు. తలకు తీవ్రంగా గాయమవడంతో అతడు మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.