తుగ్లకాబాద్: అక్రమంగా తరలిస్తున్న 21 లక్షల నెమలి తోక ఈకలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఆ నెమలి ఈకలను అక్రమ రీతిలో చైనాకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఐసీడీ తుగ్లకాబాద్ వద్ద వాటిని పట్టుకున్నారు. సుమారు 2566 కిలోల బరువు ఉన్న కన్సైన్మెంట్ను అధికారులు సీజ్ చేశారు. పీవీసీ పైపులను తీసుకువెళ్తున్నామంటూ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వైద్యం కోసం చైనీయులు నెమల తోక ఈకలను వాడుతారని ఓ అధికారి అనుమానం వ్యక్తం చేశారు.