మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 4 : సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థిని అసాధారణ ప్రతిభతో ఒకేసారి ఏకంగా 9 కంపెనీల్లో ఉద్యోగం సంపాదించింది. హాజరైన ప్రతి కంపెనీలో ప్లేస్మెంట్ సాధించింది. అంతర్జాతీయ సంస్థ డీబీఎస్ బ్యాంకు ఆమెకు అత్యధికంగా రూ.8 లక్షల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేసింది. గుండ్లపోచంపల్లిలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్లో సీఎస్ఈ చివరి సంవత్సరం చదువుతున్న బెహరా పేరిందేవి ఈ ఘనత సాధించిది. మొదటి ఏడాది నుంచే అత్యధిక మార్కులను స్కోర్ చేస్తూ 9.63 సీజీపీఏ పొందిన ఆమె, చివరి సంవత్సరంలో పలు సంస్థల్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నది. జాబ్కోసం వెళ్లిన ప్రతి కంపెనీలో విజయాన్ని సొంతం చేసుకున్నది. టీసీఎస్, హెక్సావేర్, డీఎక్స్సీ, క్యాప్ జెమినీ, మోదక్ అనలిటిక్స్, సేఫర్ డెక్, ఏడీపీ ప్రైవేట్ లిమిటెడ్, ఎంటీఎక్స్ ల్యాబ్స్, డీబీఎస్ బ్యాంకుల్లో ఉద్యోగాలకు ఎంపికైంది. బెహరాను కాలేజీ డైరెక్టర్ రామస్వామిరెడ్డి ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. భవిష్యత్లో అత్యున్నత స్థాయికి ఎదగాలని అకాంక్షించారు.
ఇవీ కూడా చదవండి…
టీఆర్ఎస్తోనే కులవృత్తులకు వైభవం
నంది మేడారంలో కాళేశ్వర గంగ పరవళ్లు..