దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను నిర్వహించిన బీసీసీఐకి రూ.1000కోట్ల జరిమానా విధించాలని బాంబే హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా భారత్లో కరోనా మరణాలు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ 2021ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను బాంబే కోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది.
విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ను నిర్వహించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు
బీసీసీఐకి రూ.1000కోట్ల ఫైన్ వేయాలని, అలాగే ఐపీఎల్ ద్వారా వచ్చే లాభాలను కరోనా చికిత్సకు అవసరమైన ఔషధాలు, మెడికల్ ఆక్సిజన్ సరఫరా కోసం ఉపయోగించేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఐపీఎల్ 14వ సీజన్ను బీసీసీఐ రద్దు చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్లో వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అమిత్ మిశ్రా కూడా కరోనా బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో టోర్నీలో కరోనా బారిన పడిన వాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఇక తప్పనిసరి
పరిస్థితుల్లో లీగ్ను సస్పెండ్ చేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.