వర్ధన్నపేట/న్యూశాయంపేట, ఏప్రిల్ 9: త్వరలో జరుగనున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని వర్ధన్నపేట ఎమ్మె ల్యే అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. వరంగల్ హంటర్రోడ్డులోని అలకనంద గార్డెన్స్లో నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో గ్రేటర్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం అందేలా ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తున్నదన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజలకు సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కోరారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు మాట్లాడుతూ నగరం చుట్టూ ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. విపక్ష పార్టీలు ప్రభుత్వంపై అర్థం లేని విమర్శలు చేస్తూ లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఐనవోలు, హసన్పర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రూ.95 ఇన్వెస్ట్తో రూ.14 లక్షలు! ఎలాగంటే!!