రైతన్న సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం
దళితుల అభ్యున్నతికి రూ.1,200 కోట్లు
ఆకుపచ్చ తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
మంత్రి పువ్వాడ అజయ్కుమార్
కల్లూరు, వైరా, రఘునాథపాలెం మండలాల్లో మంత్రి పర్యటన
కల్లూరు, వైరా, రఘునాథపాలెం, జూలై 6:అన్నదాతల ఆత్మగౌరవం, వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన కల్లూరు, వైరా, రఘునాథపాలెం మండలాల్లో నిర్వహించిన పల్లెప్రగతి, హరితహారం, దళిత సాధికారిత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆధ్వర్యంలో జూలూరుపాడు మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతల ఆత్మగౌరవమే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. వారి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలూ శ్రమిస్తున్నారని గుర్తుచేశారు. పల్లెప్రగతి, హరితహారం, దళిత సాధికారిత కార్యక్రమాల్లో భాగంగా కల్లూరు మండలంలో మంత్రి అజయ్కుమార్ మంగళవారం పర్యటించారు. ముచ్చవరంలో సర్పంచ్ గంగవరపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామంలో విత్తనాలు వెదజల్లే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్ ఆర్వీ కర్ణన్లతో కలిసి మంత్రి అజయ్ చేపట్టారు. అనంతరం రైతువేదిక భవనాన్ని, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. తరువాత హరితహారం మొక్కలు నాటారు. కప్పలబంధం గ్రామంలోని ఎన్ఎస్పీ కాలువ కట్టపై సర్పంచ్ నందిగామ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారంలోనూ పాల్గొని మొక్కలు నాటారు. కల్లూరు సర్పంచ్ లక్కినేని నీరజ రఘు ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనాన్ని ప్రారంభించారు. అంబేడ్కర్నగర్లో దళిత సాధికారిత సమావేశం ఎంపీపీ బీరవల్లి రఘు అధ్యక్షతన ఏర్పాటు చేయగా మంత్రి మాట్లాడారు. దళితుల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1200 కోట్లు మంజూరు చేసిందని పల్లె ప్రగతి పనులను పక్కాగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కల్లూరు మండలం అతిపెద్ద జనాభాను కలిగి ఉన్నందున దానిని మున్సిపాలిటీగా గుర్తించాలని కోరారు. వివిధ వసతులు సమకూర్చాలని కోరారు. అనంతరం బాబూజగ్జీవన్రావ్ చిత్రపటానికి, అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, రైతుబంధు సమితులు బాధ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పీ.రామారావు, అధికారులు, సర్పంచ్లు పాల్గొన్నారు.
‘