Telangana
- Dec 27, 2020 , 00:44:01
జేఈఈలో నాలుగు దశలకు.. ఒకేసారి దరఖాస్తు చేయొచ్చు
_1609008173.jpg)
- ఎన్టీఏ పరీక్షల విభాగం సీనియర్ డైరెక్టర్ సాధన పరాశర్ వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జేఈఈ మెయిన్స్కు హాజరయ్యే విద్యార్థులు పరీక్షలో తమ స్కోర్ను మెరుగుపరుచుకొనేందుకు నాలుగుసార్లు పరీక్షలకు హాజరుకావచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. విద్యార్థులు నాలుగింటికి నాలుగు లేదా ఏ ఒక్క పరీక్షకైనా హాజరుకావొచ్చని ఎన్టీఏ పరీక్షల విభాగం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధన పరాశర్ ఓ ప్రకటనలో తెలిపారు. నాలుగు దశల్లో పరీక్షలు రాయాలనుకొనే విద్యార్థులు ఒకేసారి పరీక్ష ఫీజును చెల్లించాలని, అన్నీ కలిపి సింగిల్ కన్ఫర్మేషన్ ఫేజ్లో దరఖాస్తు చేయవచ్చని చెప్పారు. నాలుగు పరీక్షలు రాస్తే ఎందులో ఉత్తమ స్కోర్ వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకొంటామని తెలిపారు.
- సబ్జెక్టుకు రెండు సెషన్లలో పరీక్షను నిర్వహిస్తారు. సెక్షన్ -ఏ బహులైచ్చిక ప్రశ్నలు, సెక్షన్ - బీ న్యూమరికల్ పద్ధతిలో నిర్వహిస్తారు. సెక్షన్-బీ పేపర్లో 10 ప్రశ్నలకుగాను 5 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది.
- ఒక విద్యార్థి ఒక్కసారే దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంటుంది. పొరపాటు జరుగకుండా జాగ్రత్త తీసుకోవాలి.
- ఏదేనీ ఒకే సెషన్ లేదా ఒకటికి మించి హాజరవ్వాలనుకొంటే వేర్వేరు ఫార్మాట్లలో దరఖాస్తు చేసుకోవాలి.
- కరోనాతో చాలా రాష్ర్టాలు సిలబస్ను తగ్గించగా, జేఈఈ ప్రశ్నపత్రాన్ని 90 ప్రశ్నలకు పరిమితం చేసింది. వీటిలో 75 ప్రశ్నలను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.
- పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)లో ఉంటుంది. బీఆర్క్కు సంబంధించిన డ్రాయింగ్ పేపర్ మాత్రం రాత పరీక్ష ద్వారా నిర్వహిస్తారు.
తాజావార్తలు
- కాల్పుల్లో ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జీలు మృతి
- హ్యాట్సాఫ్.. శార్దూల్, సుందర్లపై కోహ్లి ప్రశంసలు
- మొన్నటి కిమ్ పరేడ్ జో బైడెన్కు హెచ్చరికనా..?!
- ఆసక్తికర విషయం చెప్పిన రామ్..!
- జర్మనీలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- ప్రభాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్షన్..!
- ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
- ప్రజలలో చైతన్యం పెరగాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
- గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
- ‘ఉప్పెన’ వేగాన్ని ఆపతరమా..!
MOST READ
TRENDING