హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఒకనాడు నేతన్నల ఆకలి చావులతో జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెకిన సిరిసిల్ల తలరాతను మంత్రి కేటీఆర్ మార్చేశారని జిల్లా ప్రజలు కీర్తిస్తున్నారు. ఒకప్పుడు ఉరిశాలగా పిలిచిన జిల్లా ఇప్పుడు ‘సిరిశాల’గా మారిందని, కోటి బతుకమ్మ చీరెలతో తెలంగాణ ఆడబిడ్డల ముఖాల్లో సంబురాన్ని నింపుతున్నదని పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అతి తకువ కాలంలోనే నేతన్నల ఆత్మహత్యలు కనుమరుగయ్యాయని చెప్తున్నారు. ఏడేండ్లలో సిరిసిల్ల జిల్లాలో జరిగిన మార్పులపై ‘జనంసాక్షి’ బృందం క్షేత్రస్థా యి అధ్యయనం చేసింది. నేతన్నల అభిప్రాయాలను సేకరించిన డాక్యుమెంటరీని రూపొందించింది. దీనిని మంత్రి కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు, ప్రభుత్వానికి చేరవేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, జనంసాక్షి ఎడిటర్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.