జమ్మికుంట, మే 18: సీఎం కేసీఆరే తమ నాయకుడని, టీఆర్ఎస్లోనే కొనసాగుతానని జమ్మికుంట జడ్పీటీసీ డాక్టర్ శ్రీరాంశ్యాం స్పష్టంచేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్నానని, కేయూ జేఏసీ చైర్మన్గా లాఠీల దెబ్బలు తిన్న విషయాలను గుర్తుచేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని స్పష్టంచేశారు. పార్టీని బలోపేతానికి కృషిచేస్తానని అన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు వీరన్న, శ్రీనివాస్, తనుగుల సర్పంచ్ వసంత రామస్వామి పాల్గొన్నారు.