అమరావతి,జూన్ 16: వైసీపీ సర్కారు అండతో మాన్సాస్, సింహాచలం బోర్డుల ఛైర్పర్సన్గా నియమితురాలైన సంచైత గజపతిరాజు కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పదవికి దూరం కానున్నారు. దీంతో ఆమె హైకోర్టు తీర్పుపై స్పందించేందుకు ఇష్టపడటం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సంచైత ఇప్పుడు హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తానని కానీ, అక్రమాల్ని ప్రశ్నిస్తానని కానీ చెప్పడం లేదు.