ఎమ్మెల్సీ కవిత సంతాపం
జగిత్యాల రూరల్/జగిత్యాల, ఏ ప్రిల్ 29: జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం ఎంపీపీ గాజర్ల గం గారాంగౌడ్ కరోనాతో మృతి చెందారు. మండలంలోని చల్గల్కు చెందిన గంగారాంగౌడ్ (52) వారంక్రితం కరోనా బారిన పడ్డారు. జగిత్యాల ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొం దుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గంగారాంగౌడ్ మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సా నుభూతి తెలిపారు. రాష్ట్ర ఆర్థికసంఘం చైర్మన్ రాజేశంగౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతసురేశ్ తదితరులు గంగారాంగౌడ్ మృతికి సంతాపం ప్రకటించారు.