జగిత్యాల : పల్లె, పట్టణ ప్రగతిలో జగిత్యాల నియోజక వర్గం అగ్రస్థానంలో ఉండాలని స్థానిక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. నాలుగో విడత పల్లె ప్రగతి, ఏడో విడత హరితహారం,పట్టణ ప్రగతి ఇప్పటివరకు విజయవంతంగా నిర్వహించామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సారి మరింత సమన్వయంతో ఉండి రాష్ట్రంలోనే నియోజకవర్గం అగ్రగామిగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా ప్రతినిధులు, తాను పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని హామీనిచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పచ్చదనం, పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వర్షాకాలం ఆరంభమైనందున సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతి పల్లె శుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ వినోద్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ పాదయాత్ర
దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
మానవత్వం చాటుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే
దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి