హైదరాబాద్ : కొవిడ్తో ఇబ్బందుల్లో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ సభ్యురాలు, హైదరాబాద్కు చెందిన ప్రముఖ క్రికెటర్ స్రవంతి నాయుడుకు భారత హ్యాండ్బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్ రావు అండగా నిలిచారు. కష్టకాలంలో ఉన్న స్రవంతి కుటుంబానికి ఆయన గురువారం ఆర్థికసాయం అందించారు. కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న స్రవంతి తల్లిదండ్రులకు తనవంతుగా రూ. 2 లక్షలు సహాయం చేశారు. స్రవంతి తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఇక స్రవంతి పరిస్థితి తెలుసుకున్న భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రూ. 6.77 లక్షలు, హెచ్సీఏ రూ. 3 లక్షలు ఆమెకు ఆర్థికసాయం చేసిన సంగతి తెలిసిందే.