సీసీసీ నస్పూర్, మే 18: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేసిన సాయం ఓ వృద్ధురాలికి ఊపిరిపోసింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సీతారాంపల్లికి చెందిన పొనగంటి మల్లు అనే 60 ఏండ్ల వృద్ధురాలికి కరోనాతో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. ఆమె కుమారుడు రాకేశ్.. స్థానిక టీఆర్ఎస్ నేత సహాయంతో విషయాన్ని నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన.. అంబులెన్స్ సమకూర్చి ఏప్రిల్ 30న హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించారు. గాంధీలో బెడ్లు లేకపోవడంతో కుటుంబసభ్యులు విషయాన్ని.. విజిత్రావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మంత్రి కేటీఆర్తో మాట్లాడి పరిస్థితి వివరించారు. స్పందించిన కేటీఆర్ ఆయన పీఏ ద్వారా బాధితురాలి కుటుంబసభ్యులతో మాట్లాడించడం.. గాంధీ దవాఖాన ఐసీయూలో ప్రత్యేకంగా బెడ్ సౌకర్యం కల్పించడం క్షణాల్లో జరిగిపోయింది. కోలుకున్న మల్లును ఈనెల 16న వైద్యులు డిశ్చార్జి చేశారు. వెంటనే స్పందించి గాంధీలో బెడ్ ఇప్పించిన మంత్రి కేటీఆర్కు మల్లు, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు.