వచ్చే నెల 13న విచారణ
న్యూఢిల్లీ, మార్చి 16: 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో అప్పడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీకి క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్పై వచ్చే నెల 13న విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇకపై ఎలాంటి వాయిదా అభ్యర్థలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. నాటి అల్లర్లలో అహ్మదాబాద్లోని గుల్బర్గ్ సొసైటీలో 68 మంది హత్యకు గురయ్యారు. వారిలో జకియా భర్త, మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఉన్నారు.