నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 5: స్వాతంత్య్ర సమరయోధుడు, సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతిని జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో జగ్జీవన్రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన చేసిన సేవలను కొనియాడారు. వేల్పూర్లో నిర్వహించిన బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్జీవన్రామ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ భారతి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ప్రగతిభవన్ స మావేశ మందిరంలో కలెక్టర్ నారాయణరెడ్డి బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ము న్సిపల్ కమిషనర్ జితేశ్వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో రవికుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, డీఎస్సీడీవో శశికళ, కలెక్టరేట్ ఏవో సుదర్శన్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని రైల్వే కమాన్ వద్ద జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, సీపీ కార్తికేయ జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటగిరి మం డలం ఎత్తొండ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాన్ని ఉమ్మడి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఆవిష్కరించారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎర్రం విఘ్నేశ్ పాల్గొన్నారు. నగరంలోని పూలాంగ్లో ఉన్న అంబేద్కర్ దళిత సేవ సంఘం జిల్లా కార్యాలయంలో జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించినట్లు జిల్లా అధ్యక్షురాలు స్వప్న తెలిపారు. జిల్లా కే్రందంలోని పలు ప్రాంతాల్లో జగ్జీవన్రామ్ జయంతిని పలు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయ న విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు.
నగరంలోని విద్యుత్ కార్యాలయంలో ఎస్ఈ సుదర్శన్ ఆధ్వర్యంలో, మాల మహానాడు ఆధ్వర్యంలో కంఠేశ్వర్లో ఉన్న జగ్జీవన్రామ్ విగ్రహానికి మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్మూర్లో బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత, కౌన్సిలర్లు భారతి, మీనా, దళిత సంఘాల నాయకులు, దళిత జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్, గోపి, రాజు ఆధ్వర్యంలో, సర్వసమాజ్ అధ్యక్షుడు మహేశ్రెడ్డి, పీఏసీఎస్ వైస్చైర్మన్ నవీన్, బీజేపీ ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు మల్లేశ్, వార్డు సభ్యులు జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. ఆర్మూర్లోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాస్, అధికారులు విజయ్కుమార్, నర్సింగ్రావు, శ్రీనివాస్ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రెంజల్ మండలం దూపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్రామ్ విగ్రహాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి సర్పంచ్ సాయారెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి సురేశ్, డివిజన్ ఇన్చార్జి భూమయ్య, పోశెట్టి, సంజీవ్, ఉపసర్పంచ్ సాయిలు, వీడీసీ అధ్యక్షుడు లింగన్న యాదవ్, బాబన్న పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో బాబూ జగ్జీవన్రామ్ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ పూలమాల వేసి నివాళులర్పించారు. వైస్ చైర్మన్ భగత్, కౌన్సిలర్లు లింగయ్య, గంగాధర్, లత, ప్రేమలత, నర్సయ్య, సతీశ్, భూదేవి, షమీం బేగం, అనుపమ, కోఆప్షన్ సభ్యులు నవీన్, అజ్మత్, దళిత ఐక్య సంఘటన అడ్హక్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నందిపేట్లో బాబూ జగ్జీవన్రామ్ సం ఘం ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. సంఘం సభ్యులు భూదయ్య, రాజయ్య, నర్సయ్య, బాలరాజు, నరేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. నందిపేట్ మండలంలోని వెల్మల్, డొంకేశ్వర్, శాపూర్, వన్నెల్(కే) తదితర గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు బాబు జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
బోధన్ మండలం సాలూరా గ్రామంలో ఎంపీపీ బుద్దెసావిత్రి బాబు జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోధన్లోని శక్కర్నగర్ చౌరస్తాలో బాబూ జగ్జీవన్రామ్ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి, పలువురు నాయకులు, కౌన్సిలర్లు, అధికారులు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోధన్లోని రాకాసిపేట్లో సామాజిక సేవకురాలు పద్మాసింగ్ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట, మంగళ్పాడ్ గ్రామంలో మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రాం చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీటీసీ షేక్ జావీద్బాబా, ఉప సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. నవీపేట మండలం నాళేశ్వర్లో సర్పంచ్ సిరన్, నవీపేటలో ఎమ్మార్పీఎస్ నాయకులు గంగాధర్ బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.
కమ్మర్పల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో, ముప్కాల్ మండల కేంద్రంలో, మోస్రా మండలం గోవూర్లో జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. డిచ్పల్లి మండలంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్లో జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. కమాండెంట్ సత్యశ్రీనివాస్రావు జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధర్పల్లిలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ నల్లసారికారెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాల్రాజ్ ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. రైతుబంధు సమితి జిల్లా సభ్యులు, మండల కన్వీనర్ రాజ్పాల్రెడ్డి, టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్రెడ్డి పాల్గొన్నారు.
జక్రాన్పల్లితోపాటు అర్గుల్, పడకల్, తొర్లికొండ, కేశ్పల్లి గ్రామాల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో, మండలంలోని పంచాయతీ కా ర్యాలయాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు. జక్రాన్పల్లిలో జగ్జీవన్రామ్ విగ్రహానికి అరుంధతి యూత్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. రుద్రూర్లో జడ్పీటీసీ గంగారాం, ఎంపీపీ సుజాత, సర్పంచ్ శేఖర్, సిరికొండలో ఎమ్మార్పీఎస్ నాయకులు జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోపాల్ మండలం సిరిపురం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాబూ జగ్జీవన్రామ్ జయంతిని నిర్వహించారు.