కుమ్రం భీం అసిఫాబాద్ : కరోనా వేళ లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని చెప్పినా కొందరు ఆకతాయిలు పెడచెవిన పెడుతున్నారు. అలాంటి వారిపై జిల్లా పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. పోలీసులు ఎంతా చెప్పినా వినకపోవడంతో రోడ్లపై తిరుగుతున్న వారిని ఏకంగా ఐసోలేషన్ సెంటర్ కు తరలిస్తున్నారు. వాంకిడి మండలంలో అనవసరంగా బయట తిరుగుతున్న 15 మందిని వాంకిడి ఐసోలేషన్ సెంటర్కు పోలీసులు తరలించారు. కారణం లేకుండా బయటికి వచ్చిన వారిని ఐసోలేషన్ సెంటర్కు పంపిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజా శ్రేయస్సు అందరూ లాక్ డౌన్కు సహకరించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి