హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రాజ్భవన్కు చెందిన సంస్కృతి కమ్యూనిటీ హాల్ కొవిడ్ ఐసొలేషన్ సెంటర్గా మారింది. విశాలమైన ఈ భవనాన్ని కరోనా బారినపడే రాజ్భవన్ ఉద్యోగులు, అధికారులు, వారి కుటుంబసభ్యుల కోసం ఉపయోగించాలని నిర్ణయించారు. ఆర్డ్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటుచేసిన ఈ సెంటర్ను గురువారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్, ఆర్ట్ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ప్రతినిధి విశాల్ ఆర్య, గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, మొహంతి, కార్యదర్శి సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.