హైదరాబాద్: ఇండ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేపాలీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను డీసీపీ రక్షిత మూర్తి వెల్లడించారు. నగర శివార్లలోని ఇళ్లలో ఈ ముఠా గతకొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నదని చెప్పారు. సీసీఎస్, నాచారం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ముఠాలోని ఆరుగురు సభ్యులు పట్టుబడ్డారని తెలిపారు. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉన్నదని వెల్లడించారు. వారినుంచి 21 తులాల బంగారు ఆభరణాలు, 50 తులాల వెండి ఆభరణాలు, రూ.5,330 నగదు, ల్యాప్టాప్, ఎల్ఈడీ టీవీ, రెండు ఐఫోన్లు, కొన్ని ఇత్తడి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటి విలువ రూ.13 లక్షల 20 వేలు ఉంటుందన్నారు.