హైదరాబాద్ : తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు 2021-22 ఏడాదికి గాను వివేకానంద విదేశీ విద్య పథకానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరింది. ఏప్రిల్ 29వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. అర్హులైన వ్యక్తులు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వెబ్సైట్ www.brahminparishad.telangana.gov.in ను సందర్శించి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను క్షుణ్ణంగా చదివి సరైన ధృవపత్రాలు జతపరిచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులందరూ వినియోగించుకోవాల్సిందిగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు విజ్ఞప్తి చేసింది.