కాచిగూడ, మే 4: రాష్ట్రవ్యాప్తంగా టీ-సేవ ఆన్లైన్ కేంద్రాల ఏర్పాటు కోసం నిరుద్యోగ యువత ఈ నెల 25వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని టీ-సేవ సంస్థ డైరెక్టర్ అడపా వెంకట్రెడ్డి సూచించారు. మంగళవారం కాచిగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. స్వర్ణ తెలంగాణ స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తు చేసుకొనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులు, వికలాంగులు, రిటైర్డ్ సైనికులకు ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. వివరాలకు ఫోన్నంబర్లో 8179955744, లేదా www.tsevacentre.com లో సంప్రదించాలని కోరారు.