హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): గాంధీ, సికింద్రాబాద్తోపాటు హైదరాబాద్ జిల్లా పరిధిలోని దవాఖానల్లో కొవిడ్ వైద్యసేవలు అందించేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి జే వెంకటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఆరు నెలలు తాత్కాలిక పద్ధతిపై విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు జిల్లా అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలని, దానిని పూరించి, సంబంధిత ధ్రువపత్రాలతో ఈ నెల 20, 21 తేదీల్లో సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.