హైదరాబాద్ : అంతరాష్ట్ర బస్సు సర్వీసులను టీఎస్ఆర్టీసీ రేపటి నుంచి పునరుద్దరించింది. రేపటి నుంచి ఏపీ, కర్ణాటకలోని గమ్యస్థానాలకు బస్సులు నడపనుంది. ఆయా రాష్ర్టాల్లోని లాక్డౌన్ నిబంధనలు అనుసరించి టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపనుంది. రద్దీకి అనుగుణంగా రోజూ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఏపీకి బస్సు సర్వీసులు నడపనుంది. అదేవిధంగా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కర్ణాటకకు సర్వీసులను నడపనుంది.
ఏపీఎస్ఆర్టీసీ సైతం రేపట్నుంచి తెలంగాణ రాష్ర్టానికి బస్సులు నడపాలని నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు నడపాలని నిర్ణయం. విజయవాడ సహా పలు ప్రాంతాల నుంచి రాష్ర్టానికి బస్సు సర్వీసులు నడవనున్నాయి.