న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నీలో కరోనా కలకలం సృష్టించింది. ముగ్గురు షూటర్లు కొవిడ్-19 పాజిటివ్గా పరీక్షించినట్లు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) వర్గాలు శనివారం తెలిపాయి. ప్రస్తుతం షూటర్లు తమ హోటల్ గదుల్లో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారని పేర్కొన్నాయి. వైరస్ బారినపడ్డ షూటర్లతో ఆయా గదుల్లో ఉన్న మరో ముగ్గురు క్రీడాకారులు సైతం పరీక్షలు చేయించుకున్నారు. వారి ఫలితాలు రావాల్సి ఉండగా.. ముందస్తుగా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. ముగ్గురు షూటర్లలో ఇద్దరు భారత క్రీడాకారులేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నలుగురు వైరస్ బారినపడగా.. గురువారం మరో విదేశీ ఆటగాడు కొవిడ్ పాజిటివ్గా పరీక్షించడంతో.. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.