వెల్దుర్తి, జూలై 8: పల్లెప్రగతి నిరంతర ప్రక్రియని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని కుకునూర్, దామరంచ, ధర్మారం, మానేపల్లి గ్రామాల్లో మొక్కలు నాటి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. మానేపల్లిలో యాదవ సంఘం భవనం, పాఠశాల ఆవరణలో నిర్మించిన సైన్స్ల్యాబ్లను ఎమ్మెల్యే మదన్రెడ్డి, అసంఘటిత కార్మిక సంక్షేమ సంఘం చైర్మన్ దేవేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, పీడీ శ్రీనివాస్, ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్గౌడ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మానేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి సంక్షేమ పథకాల పర్యవేక్షణ కోసం సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.
పల్లెప్రగతి కార్యక్రమం అందరి బాధ్యత అని, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో, సమష్టి కృషితో కొనసాగించాలని సూచించారు. మానేపల్లిలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం స్తంభాలు, విద్యుత్ తీగలు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ డీఈని ఆదేశించారు. బీడీ కార్మికుల పెన్షన్లను త్వరగా మంజూరయ్యేలా చూడాలని పీడీ శ్రీనివాస్కు సూచించారు. మానేపల్లిలో అర్హులైన నిరుపేదల కోసం రెండు విడుతల్లో వంద డబుల్బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ మన్సూర్, పీఆర్ డీఈ రాధిక, ఏపీడీ స్వప్న, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో జగదీశ్వరాచారీ, సర్పంచ్లు ప్రీతి, భాస్కర్రెడ్డి, శంకర్రెడ్డి, వెంకటలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, వెల్దుర్తి ఎంపీటీసీ మోహన్రెడ్డి, నాయకులు నరేందర్రెడ్డి, ప్రతాప్రెడ్డి, మహేందర్రెడ్డి, కృష్ణారెడ్డి, సత్యంగౌడ్, నర్సింహులు, శివకుమార్, శ్రీనివాస్రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
మనోహరాబాద్ మండలంలో..
మనోహరాబాద్ మండలంలోని మండలంలోని కాళ్లకల్లో 13వ వార్డులో ఖాళీ స్థలంలో చెత్తా చెదారాన్ని ఇన్చార్జి సర్పంచ్ కాళిదాస్ తొలగించారు. ముప్పిరెడ్డిపల్లిలో మూడు కిలోమీటర్ల మేర 21 ఫీట్లుగా ఉన్న రోడ్డుకు ఇరువైపులా మట్టితో నింపి 50 ఫీట్ల రోడ్డుగా వెడల్పు చేశారు. మనోహరాబాద్లో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల మహిపాల్రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలను నాటారు. రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్ ముదిరాజ్, ఎంపీటీసీ నత్తి లావణ్య, సర్పంచ్ నరాల ప్రభావతిపెంటయ్య, కో ఆప్షన్ మెంబర్ జావీద్ పాల్గొన్నారు.
చేగుంట మండల పరిధిలోని పోతాన్పల్లి, కసాన్పల్లి గ్రామాల్లో గురువారం మండల ప్రత్యేకాధికారి జయరాజ్ పర్యటించి, డంపింగ్యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను పరిశీలించారు. మండల కేంద్రమైన చేగుంటలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, తాసీల్దార్ విజయలక్ష్మి, ట్రాక్టర్ సహాయంతో పిచ్చిమొక్కలను తొలిగించి, గుంతలను పూడ్చివేయించారు. చెట్ల తిమ్మాయిపల్లిలో సర్పంచ్ మోహన్ గ్రామ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటించారు. ఎంపీవో ప్రశాంత్, ఈవో రాణి, పంచాయతీ కార్యదర్శులు కల్పన, గ్రామ నాయకులు కారింగుల సిద్దిరెడ్డి, యాసిరేణి శ్రీకాంత్రెడ్డి, మహమ్మద్ అలీ, పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు ఉన్నారు.
నార్సింగిలో..
పల్లె ప్రగతిలో భాగంగా గురువారం మండల కేంద్రమైన నార్సింగిలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఎంపీపీ చిందం సబిత మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎర్రం అశోక్ ఎస్ఎంసీ చైర్మన్ బాకర్, హెచ్ఎం జ్ఞానమాల, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రకృతికి వరం పచ్చని చెట్లు
పచ్చనిచెట్లతో ప్రకృతి పచ్చగా ఉంటుందని రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, ఎంపీవో గిరిజారాణి, ప్రత్యేక అధికారి వినోద్కుమార్, గ్రామ సర్పంచ్ చంద్రకళ అన్నారు. గురువారం రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మొక్కనాటి వాటికి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. కార్యదర్శి చంద్రహాస్, ఉప సర్పంచ్ దీపక్రెడ్డి, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకుడు దోమ ఇమ్మానియేల్ ఉన్నారు.
హరిత, ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
హరిత, ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని నస్కల్ గ్రామం బీసీ కాలనీ నుంచి అంతర్ జిల్లా తుజాల్పూర్ గ్రామం వరకు నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డుకు ఇరువైపులా గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులతో ఎంపీపీ కలిసి 1000 మొక్కలు నాటారు. పీఆర్ డీఈ పాండురంగారెడ్డి, ఏఈ మధుసూదన్రెడ్డి, ఇన్చార్జి సర్పంచ్ కవిత, పంచాయతీ కార్యదర్శి ప్రేమలత, టెక్నికల్ అసిస్టెంట్ నాగిరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.
ప్రగతిపై అవగాహన కల్పించాలి..
పల్లె ప్రగతిపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీపీవో తరుణ్కుమార్ అన్నారు. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో ఆయన గురువారం ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలో తిరుగుతూ మురికి కాల్వలు, రోడ్లు శుభ్రంగా ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులను శాలువాతో సన్మానించి, రూ. 1500ల నగదు బహుమతి ఇచ్చి అభినందించారు. డీఎల్పీవో వరలక్ష్మి, సర్పంచ్ సుగుణమ్మ, నాయకుడు పెంటాగౌడ్ పాల్గొన్నారు.