హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ ): కరోనా కారణంగా కాలేజీలు మూతపడటంతో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంటర్నల్ ఎగ్జామ్స్ను ఇంటివద్దే రాసుకునే వెలుసుబాటును కల్పిస్తూ ఇంటర్బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. నైతిక విలువలు, పర్యావరణ విద్య పరీక్షలను అసైన్మెంట్ రూపంలో విద్యార్థులకిచ్చి, ఇంటివద్దనే రాసుకునే అవకాశమిస్తూ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. జనరల్, ఒకేషనల్ కోర్సుల్లోని ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఏప్రిల్ 1 నుంచి 20 వరకు సంబంధిత కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల నుంచి ప్రశ్నపత్రాలను తీసుకొని, ఇంటివద్దనే సమాధానాలు రాసుకోవచ్చన్నారు. జవాబు పత్రాలను స్వయం గా ప్రిన్సిపాళ్లకు అందజేయవచ్చని, లేదంటే తపాలా, ఈ-మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం హాల్టికెట్లను ఏప్రిల్ 1 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు జలీల్ వెల్లడించారు. విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఇవీ కూడా చదవండి
హాంకాంగ్పై చైనా మళ్లీ కన్నెర్ర..
ఆసియన్-అమెరికన్ వృద్ధురాలిపై