లక్నో : ఓ పెళ్లి కూతురు గాల్లోకి కాల్పులు జరిపి వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రతాప్ఘర్ జిల్లాలోని జెథ్వారా ఏరియాకు చెందిన రూపా పాండే తన వివాహ ముహుర్తానికి ముందు స్టేజ్ ఎక్కుతున్న క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపింది. ఈ వీడియో పోలీసుల దాకా చేరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూపా పాండే కాల్పులు జరిపిన రివాల్వర్ ఆమె మామ రామ్ నివాస్ పాండేది అని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో రూపా పాండేతో పాటు రామ్ నివాస్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.