మంచిర్యాల : జిల్లాలోని కోటపల్లి మండలం రాపనపల్లి గ్రామం వద్ద గల అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ లో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. అక్కడ డ్యూటీలో ఉన్న సిబ్బందితో మాట్లాడి వారికి తగిన సూచనలు, సలహాలు చేశారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు అందరూ ఇండ్లలోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. అనంతరం కోటపల్లి మండలంలోని లక్ష్మీపూర్, దేవులవాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస రావు దేశ్ పాండే, గిర్దావర్లు జశ్వంత్, రాజలింగు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పారాణి ఆరకముందే తనువు చాలించిన వధువు
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతి
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : మంత్రి పువ్వాడ
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి